Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
తొలి '3డి' సైకిక్ థ్రిల్లర్ తెలుగులో 'ఓకే'
దేశంలోనే 3డిలో వస్తున్న తొలి సైకిక్ థ్రిల్లర్ మా సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ద్వారా తనీశ్ని బాలీవుడ్కు పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం అని నిర్మాత రాజ్వర్మ తమ కొత్త చిత్రం 'ఓకే' గురించి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఎస్ సంతోష్ సమకూరుస్తున్నారు. ఉషాకిరణ్ వారి నచ్చావులే చిత్రంతో పరిచయమైన తనీష్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.దిష, అశ్విత హీరోయిన్స్ గా చేస్తున్నారు.
హీరో తనీశ్ మాట్లాడుతూ "నేనిప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. సైకిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కొత్త తనీశ్ని చూస్తారు" అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం రామానాయుడు స్టూడియోస్లో ఉగాది రోజు ప్రారంభమైంది. డి ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి సన్నివేశానికి దర్శకుడు వివి వినాయక్ క్లాప్నివ్వగా, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి దర్శకుల సంఘాధ్యక్షుడు వి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.