Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తొలి రోజే ‘దూకుడు’కు తెలంగాణ సెగ
సూపర్ స్టార్ మహేష్ నటించిన 'దూకుడు" సినిమాకు విడుల రోజే కష్టాలు చుట్టుముట్టాయి. శుక్రవారం విడుదలైన సినిమాను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. శంషాబాద్, పరిగి, వికారాబాద్, తాండూరు తదితర ప్రాంతాలతో పాటు, మరికొన్ని కొన్ని తెలంగాణ ప్రాంత థియేటర్లపై దాడి చేసిన తెలంగాణ వాదులు పోస్టర్లను చించి వేసి నిరసన తెలిపారు. జై తెలంగాణ నినాదాల చేస్తూ....తెలంగాణ ఉద్యమానికి కనీస మద్దతు తెలపని సీమాంధ్ర ప్రాంత హీరోలు సినిమాలను ఇక్కడ ఆడనివ్వబోమని హెచ్చరించాయి. ఈ క్రమంలో తెలంగాణ వాదులకు, థియేటర్ యాజమాన్యం మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపులోకి తేవడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా కుప్పంలో దూకుడు సినిమాను 45 నిమిషాలు ఆపి వేశారు. సినిమా చూసేందుకు భారీగా తరలివచ్చి అభిమానుల ఒక్కసారిగా టిక్కెట్ల కోసం ఎగబడటంతో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ, టిక్కెట్లు అయిపోయాయని బుకాయిస్తున్న థియేటర్ యాజమాన్యం తీరుపై అభిమానులు ఆందోళనకు దిగారు.
మహేష్ బాబు, సమంత జంటగా నటిస్తున్న దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు.