Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వ్యవసాయానికి బానిసైన ప్లాపు డైరెక్టర్!
నువ్వునేను, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అయ్యారు. ఆయన చివరగా తెలుగులో దర్శకత్వం వహించిన రెయిన్ బో, ముగ్గురు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ దర్శకుడు వ్యవసాయానికి బానిసయ్యాడు. వ్యవసాయానికి బానిసవ్వడం ఏమిటి? అదీ ఓ వృత్తేగా....అని అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఈ దర్శకుడు వ్యవసాయం చేస్తున్న మాట నిజమేగానీ, నాగలి పట్టి...పొలంలో దిగి, పాడి పశువులు పెంచుతూ చేయడం లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేస్తున్నారు.
అసలు విషయానికొస్తే....విఎన్ ఆదిత్య ఫేస్బుక్లో బాగా పాపులర్ అయిన 'ఫార్మ విల్లె' ఆన్లైన్ గేమ్కు బానిసయ్యాడట. మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేయడమే ఈ గెమ్ స్పెషాలిటీ. కథా చర్చలు మినహా మిగతా సమయాన్నంతా ఈ గేమ్ ఆడటానికే వృధా చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈ దర్శకుడు 'చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి', త్రీఇడియట్స్ పేరుతో తెలుగు చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు.