Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వ్యవసాయానికి బానిసైన ప్లాపు డైరెక్టర్!
నువ్వునేను, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అయ్యారు. ఆయన చివరగా తెలుగులో దర్శకత్వం వహించిన రెయిన్ బో, ముగ్గురు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ దర్శకుడు వ్యవసాయానికి బానిసయ్యాడు. వ్యవసాయానికి బానిసవ్వడం ఏమిటి? అదీ ఓ వృత్తేగా....అని అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఈ దర్శకుడు వ్యవసాయం చేస్తున్న మాట నిజమేగానీ, నాగలి పట్టి...పొలంలో దిగి, పాడి పశువులు పెంచుతూ చేయడం లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేస్తున్నారు.
అసలు విషయానికొస్తే....విఎన్ ఆదిత్య ఫేస్బుక్లో బాగా పాపులర్ అయిన 'ఫార్మ విల్లె' ఆన్లైన్ గేమ్కు బానిసయ్యాడట. మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేయడమే ఈ గెమ్ స్పెషాలిటీ. కథా చర్చలు మినహా మిగతా సమయాన్నంతా ఈ గేమ్ ఆడటానికే వృధా చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈ దర్శకుడు 'చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి', త్రీఇడియట్స్ పేరుతో తెలుగు చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు.