Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వ్యవసాయానికి బానిసైన ప్లాపు డైరెక్టర్!
నువ్వునేను, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అయ్యారు. ఆయన చివరగా తెలుగులో దర్శకత్వం వహించిన రెయిన్ బో, ముగ్గురు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ దర్శకుడు వ్యవసాయానికి బానిసయ్యాడు. వ్యవసాయానికి బానిసవ్వడం ఏమిటి? అదీ ఓ వృత్తేగా....అని అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఈ దర్శకుడు వ్యవసాయం చేస్తున్న మాట నిజమేగానీ, నాగలి పట్టి...పొలంలో దిగి, పాడి పశువులు పెంచుతూ చేయడం లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేస్తున్నారు.
అసలు విషయానికొస్తే....విఎన్ ఆదిత్య ఫేస్బుక్లో బాగా పాపులర్ అయిన 'ఫార్మ విల్లె' ఆన్లైన్ గేమ్కు బానిసయ్యాడట. మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేయడమే ఈ గెమ్ స్పెషాలిటీ. కథా చర్చలు మినహా మిగతా సమయాన్నంతా ఈ గేమ్ ఆడటానికే వృధా చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈ దర్శకుడు 'చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి', త్రీఇడియట్స్ పేరుతో తెలుగు చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు.