Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వ్యవసాయానికి బానిసైన ప్లాపు డైరెక్టర్!
నువ్వునేను, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అయ్యారు. ఆయన చివరగా తెలుగులో దర్శకత్వం వహించిన రెయిన్ బో, ముగ్గురు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ దర్శకుడు వ్యవసాయానికి బానిసయ్యాడు. వ్యవసాయానికి బానిసవ్వడం ఏమిటి? అదీ ఓ వృత్తేగా....అని అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఈ దర్శకుడు వ్యవసాయం చేస్తున్న మాట నిజమేగానీ, నాగలి పట్టి...పొలంలో దిగి, పాడి పశువులు పెంచుతూ చేయడం లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేస్తున్నారు.
అసలు విషయానికొస్తే....విఎన్ ఆదిత్య ఫేస్బుక్లో బాగా పాపులర్ అయిన 'ఫార్మ విల్లె' ఆన్లైన్ గేమ్కు బానిసయ్యాడట. మౌస్ క్లిక్లతో వ్యవసాయం చేయడమే ఈ గెమ్ స్పెషాలిటీ. కథా చర్చలు మినహా మిగతా సమయాన్నంతా ఈ గేమ్ ఆడటానికే వృధా చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈ దర్శకుడు 'చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి', త్రీఇడియట్స్ పేరుతో తెలుగు చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు.