Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బిపాసా రాణాను ఎందుకు దూరం చేసింది?
రాణా దగ్గుబాటి, బిపాసా బసు బాలీవుడ్ మూవీ 'దమ్ మారో దమ్' చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, చాటు మాటుగా ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నో సార్లు ఈ వార్తలు జాతీయ మీడియా నుంచి స్థానిక వార్త పత్రికల్లోనూ, వెబ్ సైట్లలోనూ చెక్కర్లు కొట్టాయి. అవి నిజమేనేమో అని నమ్మేలోగా రాణా లేదా బిపాసా ఆ వార్తలను ఖండించడం జరుగుతూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో మళ్లీ ఇద్దరు సన్నిహితంగా మెలుగుతుండటం, రహస్యంగా కలుస్తుండటంతో వీరు మీడియాకు కహానీలు చెబతూ సీక్రెట్గా ఎఫైర్ కొనసాగిస్తున్నారని మళ్లీ పత్రికల్లో, టీవీ చానల్స్ లో వార్తలు రావడం రొటీన్ అయి పోయింది.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని వాడుకుని జనాలను ఫూల్స్ చేసింది ఓ ఆంగ్ల పత్రిక. ఏఫ్రిల్ ఫూల్స్ డే సందర్బంగా...రాణా, బిపాసా పెళ్లి ద్వారా ఏకం కాబోతున్నారంటూ వార్తను ప్రచురించింది. చివర్లో ఇది ఏప్రిల్ ఫూల్ న్యూస్ అంటూ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం రాణా... క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా బాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్మెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. రాణా తాజా చిత్రం 'నా ఇష్టం' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.