Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిపాసా రాణాను ఎందుకు దూరం చేసింది?
రాణా దగ్గుబాటి, బిపాసా బసు బాలీవుడ్ మూవీ 'దమ్ మారో దమ్' చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, చాటు మాటుగా ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నో సార్లు ఈ వార్తలు జాతీయ మీడియా నుంచి స్థానిక వార్త పత్రికల్లోనూ, వెబ్ సైట్లలోనూ చెక్కర్లు కొట్టాయి. అవి నిజమేనేమో అని నమ్మేలోగా రాణా లేదా బిపాసా ఆ వార్తలను ఖండించడం జరుగుతూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో మళ్లీ ఇద్దరు సన్నిహితంగా మెలుగుతుండటం, రహస్యంగా కలుస్తుండటంతో వీరు మీడియాకు కహానీలు చెబతూ సీక్రెట్గా ఎఫైర్ కొనసాగిస్తున్నారని మళ్లీ పత్రికల్లో, టీవీ చానల్స్ లో వార్తలు రావడం రొటీన్ అయి పోయింది.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని వాడుకుని జనాలను ఫూల్స్ చేసింది ఓ ఆంగ్ల పత్రిక. ఏఫ్రిల్ ఫూల్స్ డే సందర్బంగా...రాణా, బిపాసా పెళ్లి ద్వారా ఏకం కాబోతున్నారంటూ వార్తను ప్రచురించింది. చివర్లో ఇది ఏప్రిల్ ఫూల్ న్యూస్ అంటూ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం రాణా... క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా బాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్మెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. రాణా తాజా చిత్రం 'నా ఇష్టం' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.