Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆఫర్స్ లేవని మీడియా వద్ద ఏడుపు
ఆస్కార్ విన్నర్ 'స్లమ్డాగ్ మిలియనీర్' సినిమాతో హలీవుడ్ లో సినిమాలు సాధించిన ఇండియన్ అమ్మాయి.. ఫ్రిదా పింటో.ఆమె తాజా చిత్రం 'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఈ వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ''బాలీవుడ్లో నాకు అవకాశాలు రావటం లేదు. వచ్చినా ఒకటి ఆరా ఆఫర్స్ వచ్చినా అవి కధలు బాగోటం లేదు.. ఇప్పటి వరకూ విన్న కథల్లో ఏదీ నన్ను ఆకట్టుకోలేదు. సినిమాలేం చేయకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టరు. నేనేం పెద్ద స్టార్ని కాదు కదా'' అని బాధపడుతోంది.అలాగే ...ఇదే పరిస్ధితి కొనసాగితే..ఏదో ఒక రోజు నేనే సొంతంగా ఓ సినిమా తీస్తా. అంతకు ముందే నిర్మాణ రంగం మీద కాస్త అనుభవం సంపాదించాలి. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మొదట ఆమె రచ్చ గెలిచి వచ్చినా ఇంట్లో గెలవలేకపోతోంది. మరి ఆమె భాధ చూసి ఎవరన్నా ఆఫర్ ఇచ్చి ఆమెను ఓదారుస్తారేమో చూడాలి.