Don't Miss!
- News మీ సేవలు చాలు ఇక- `అప్ప`ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఆఫర్స్ లేవని మీడియా వద్ద ఏడుపు
ఆస్కార్ విన్నర్ 'స్లమ్డాగ్ మిలియనీర్' సినిమాతో హలీవుడ్ లో సినిమాలు సాధించిన ఇండియన్ అమ్మాయి.. ఫ్రిదా పింటో.ఆమె తాజా చిత్రం 'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఈ వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ''బాలీవుడ్లో నాకు అవకాశాలు రావటం లేదు. వచ్చినా ఒకటి ఆరా ఆఫర్స్ వచ్చినా అవి కధలు బాగోటం లేదు.. ఇప్పటి వరకూ విన్న కథల్లో ఏదీ నన్ను ఆకట్టుకోలేదు. సినిమాలేం చేయకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టరు. నేనేం పెద్ద స్టార్ని కాదు కదా'' అని బాధపడుతోంది.అలాగే ...ఇదే పరిస్ధితి కొనసాగితే..ఏదో ఒక రోజు నేనే సొంతంగా ఓ సినిమా తీస్తా. అంతకు ముందే నిర్మాణ రంగం మీద కాస్త అనుభవం సంపాదించాలి. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మొదట ఆమె రచ్చ గెలిచి వచ్చినా ఇంట్లో గెలవలేకపోతోంది. మరి ఆమె భాధ చూసి ఎవరన్నా ఆఫర్ ఇచ్చి ఆమెను ఓదారుస్తారేమో చూడాలి.