Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్ 'జంజీర్' ఆన్ లొకేషన్ స్టిల్ సూపర్బ్ (కొత్త ఫోటో)
ముంబై: రామ్ చరణ్ హిందీలో 'జంజీర్' రీమేక్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆన్ లొకేషన్ లో ప్రియాంకచోప్రా,సంజయ్ దత్,దర్శకుడు అపూర్వ లఖియా,రామ్ చరణ్ లతో కూడిన ఫోటో ఒకటి విడుదల అయ్యింది. ప్రియాంక చోప్రా ఈ ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో చరణ్, ప్రియాంక చోప్రా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారని, అభిమానులు సూపర్బ్ అంటున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని సైతం ఇక్కడ ఆంద్రాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి గానూ 'రుస్తుం' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. 'రుస్తుం' టైటిల్ తో గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. గతంలో మగధీర చిత్రంలోనూ శ్రీహరి 'షేర్ ఖాన్' పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అతని పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం కాకతాళీయమే అయినా..... అతనిపై పాత్రపై సర్వత్రా ఆస్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబినేషన్ మరో భారీ విజయానికి దారి తీస్తుందనే అంచనాలున్నాయి.
రామ్ చరణ్ మరో వైపు తెలుగులో 'ఎవడు' చిత్రం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ 'జంజీర్' చిత్రాన్ని హిందీ వెర్షన్ కి అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి మాత్రం దర్శకుడు యోగి పర్యవేక్షణలో చేస్తున్నారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సూచనల మేరుకు ఈ మార్పు జరిగినట్లు సమచారం. వెంకటేష్ తో చింతకాయల రవి చిత్రం చేసిన యోగి ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కి నేటివిటీ కోసం ఈ దర్శకుడుని తీసుకున్నట్లు వినికిడి. ఇక ఈ చిత్రం విషయమై ప్రతీ దాన్ని చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రచ్చ విషయంలోనూ చిరంజీవి ఇలాగే దగ్గరుండి సినిమా చేయించుకున్నారు.
అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.