Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
200 రోజులు పూర్తి చేసుకున్న ‘గబ్బర్ సింగ్’!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం 5 సెంటర్లలో రెండు వందల రోజులు పూర్తి చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. 2012లో ఈచిత్రం బిగ్గెస్ హిట్ చిత్రంగా నిలవడమే కాదు....టాలీవుడ్ చరిత్రలో పలు సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోందనే ప్రచారం ఇటీవల జరిగినా....ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏమీ లేదని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే ప్రకటించారు. నేను గానీ, నిర్మాత బండ్ల గణేష్ గానీ ఎప్పుడూ గబ్బర్ సింగ్-2 గురించి మాట్లాడుకోలేదు. ఏదైనా పవర్ స్టారే డిసైడ్ చేస్తారు' అంటూ ట్వీట్ చేసాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) చేయడానికి రెడీ వుతున్నారు. ఈచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్లోని ఓ దేవాలయంలో ఇటీవల జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది.