twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    400 కెమెరాలతో పవన్ ఎంట్రీ సీన్!

    By Bojja Kumar
    |

    పవన్ కళ్యాన్ హీరోగా రాబోతున్న 'గబ్బర్ సింగ్" సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా....హారిష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇందులో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ భారీగా రూపొందించారని తెలిసింది. ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ సీన్ చిత్రీకరణకు ఏకంగా 400 కెమెరాలను ఉపయోగించారట. మరి ఆ సీన్ ఎంత భారీగా ఉంటుందో సినిమా విడుదలైతేగానీ తెలీదు.

    ఈ సినిమాలో ఇంకా సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్, నాగినీడు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ను తమిళనాడులోని పొల్లాచ్చిలో చిత్రీకరించేందుకు ఏర్పాటు చేశారు. ఇక్కడ పవణ్, శృతి హాసన్ లపై కొన్ని కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన హిందీ దబాంగ్ సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.

    English summary
    The latest we hear is the introduction scene of Pawan Kalyan that is being shot with 400 cameras in Gabbar Singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X