Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
400 కెమెరాలతో పవన్ ఎంట్రీ సీన్!
పవన్ కళ్యాన్ హీరోగా రాబోతున్న 'గబ్బర్ సింగ్" సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా....హారిష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇందులో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ భారీగా రూపొందించారని తెలిసింది. ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ సీన్ చిత్రీకరణకు ఏకంగా 400 కెమెరాలను ఉపయోగించారట. మరి ఆ సీన్ ఎంత భారీగా ఉంటుందో సినిమా విడుదలైతేగానీ తెలీదు.
ఈ సినిమాలో ఇంకా సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్, నాగినీడు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ను తమిళనాడులోని పొల్లాచ్చిలో చిత్రీకరించేందుకు ఏర్పాటు చేశారు. ఇక్కడ పవణ్, శృతి హాసన్ లపై కొన్ని కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన హిందీ దబాంగ్ సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.