Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఇంకా తగ్గని ‘గబ్బర్ సింగ్’ మేనియా!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం గత సంవత్సరం విడుదలై రికార్డుల మీద రికార్డుల సృష్టించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ మీద ఉన్న క్రేజ్....ఫుల్లీ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్ట్ వెరసి గబ్బర్ సింగ్ చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిపాయి.
సినిమా గత సంవత్సరం విడుదలైనా...జనాల్లో గబ్బర్ సింగ్ చిత్రంపై క్రేజ్ తగ్గలేదు. తాజాగా శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు చోట్ల మిడ్ నైట్ షోలలో భాగంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శించిన అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి 'గబ్బర్ సింగ్' మేనియా ఇంకా తగ్గలేదని స్పష్టం అవుతోంది.
'గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్పైనే కాదు... స్మాల్ స్క్రీన్పై కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈచిత్రం బుల్లితెరపై మగధీర రికార్డును బద్దలు కొట్టింది. నెం.1 హిట్ సినిమాగా రుజువు చేసుకుంది. పవన్ కళ్యాణ్కు ఎంత ఫాలోయింగ్ ఉందో నిరూపించింది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు... గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ రికార్డు రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంపై ఉండేది. తాజాగా ఆ రికార్డును గబ్బర్ సింగ్ తిరగరాసాడు.
ఇటీవల సంక్రాంతి సందర్భంగా టీవీల్లో ప్రసారం అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి అత్యధికంగా 24 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది.. దీంతో మగధీర చిత్రం నెం.2 స్థానానికి వెళ్లి పోయింది. పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించారు.