ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో కోదండరామరెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'పున్నమి నాగు' . అప్పటి చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ దీనికున్న ఒక ఎస్సెట్ అయితే,యండమూరి వీరేంద్రనాధ్ చిరవిరామం తర్వాత ఈ చిత్రానికి కథ అందించటం మరో విశేషం. అలాగే ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక కొత్త విలన్ ని తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను మరెవరో కాదు 'షోలే' చిత్రంలో "అరె ఓ సాంబా...!" తో పాపులర్ అయిన గబ్బర్ సింగ్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ కుమారుడు. అతని పేరు సాజిద్ ఖాన్. రాజీవ్ కనకాల మరో ఫ్రధాన పాత్రలో చేస్తున్న ఈ సినిమాలో అతని విలనీ ప్రత్యేక తరహాలో ఉంటుందిట. అది కనుక క్లిక్ అయితే తెలుగుకి మరో విలన్ దొరికినట్లే ...బెస్టాఫ్ లక్ సాజిద్ ఖాన్.