Don't Miss!
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
నందీ అవార్డు పై గద్దర్ స్పందన
'జైబోలో తెలంగాణ' చిత్రానికిగాను ఆయనకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం లభించింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... 'జై బోలో తెలంగాణ' కథ కాదు. ఓ ఉద్యమం. తెలంగాణ ప్రజల మనోభావాలకు తెరరూపం. ఈ సృజనను, ఆవేదనను, ఆర్తిని అర్థం చేసుకొన్న న్యాయ నిర్ణేతలకు నా కృతజ్ఞతలు. ఇది వరకు కూడా నేను సినిమాలు తీశాను. వ్యక్తిగతంగా పురస్కారాలు దక్కాయి. అయితే.. ఎక్కువ ఆనందాన్ని అందించిన నంది ఇదే. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి గౌరవం దక్కినా అది తెలంగాణ పోరాట యోధులకు, ప్రజలకు అంకితం అన్నారు.
అలాగే ఓ సమస్యను తెరపై చూపించాలనుకొన్నప్పుడు డాక్యుమెంటరీ లక్షణాలు సినిమాకి అంటకుండా దాటుకుంటూ వెళ్లడం కష్టం. ఆ సమస్యను ఎలా అధిగమించారు..? బహుశా ఈ విషయంలోనే జ్యూరీ నా ప్రతిభ గుర్తించి ఉంటుందేమో? ఓ సినిమా తీయాలనుకొన్నప్పుడు ఓ కథ రాసుకొంటాం. సన్నివేశాలు అల్లుకొంటాం. దాని ప్రకారం చిత్రీకరణ జరుపుతాం. కానీ రాసుకోవడానికి ఇది కథ కాదు. ఉద్యమం. సినిమా మొదలైనప్పటి నుంచీ విడుదలైనంత వరకూ ఉద్యమం వివిధ రూపాలు సంతరించుకొంది. మరో వైపు ప్రభుత్వం కమిటీలపై కమిటీలు వేస్తోంది. విద్యార్థులు, మేధావుల మనోభావాలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. వీటన్నింటినీ తెరపై చూపించడం కత్తి మీద సామే అని చెప్పుకొచ్చారు.
'జైబోలో తెలంగాణ' సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. దర్శకుడిగా. ఎక్కువ ఆనందం... కెప్టెన్గానే దక్కింది. జాతీయ సమగ్రత విభాగంలో పురస్కారం దక్కడం కూడా సంతోషమే. గాయకుడు గద్దరన్నకి నా శుభాకాంక్షలు. ప్రస్తుతం ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకొనే సినిమాలు తీస్తున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. సినిమాకి సామాజిక బాధ్యత ఉంది. శక్తిమంతమైన మాధ్యమం సినిమా. మంచి కోసం ఉపయోగించండి. మంచి సినిమాలే తీయండి అని చెప్పుకొచ్చారు.