Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జెడి చక్రవర్తి దర్శకత్వంలో రీ ఎంట్రీ ఇస్తోన్న గజాల
స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన చేసిన గజాల ఆ తర్వాత తొట్టి గ్యాంగ్ వంటి కొన్ని చిత్రాలు చేసినా మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గిపోవటంతో మాయమైపోయింది. అయితే త్వరలో ఆమె మళ్ళీ తెలుగు తెరను పలకరించటానికి రెడీ అవుతోంది. జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న మనీ సీక్వెల్ 'మనీ మనీ మోర్ మనీ' చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. 'అనంతపురం', 'సర్వం' వంటి డబ్బింగ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింహపురి టాకీస్ అధినేతలు రఘునాద్, నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. బ్రహ్మానందంకీ రోల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ విషయమై నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నారు. 'హోమం', 'సిద్దం' తో మాస్, యాక్షన్ చిత్రాలు బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్న జే.డి. 'మనీ మనీ మోర్ మనీ' తో కామెడి కూడా బాగా తీయగలరని నిరుపించుకుంటారు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: భరణి కే ధరన్, కదా,స్క్రీన్-ప్లే, దర్శకత్వం: జె.డి.చక్రవర్తి.