గణేష్ ఆడియో రిలీజ్

కోటి మాట్లాడుతూ, తన మిత్రుడు రవికిషోర్ మంచి కథతో ఈ చిత్రాన్ని తీశాడనీ, మిక్కీ జె.మేయర్ చక్కటి సంగీతం అందించారనీ అన్నారు. ఇదే సంస్థలో వచ్చిన 'రెడీ' తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, స్రవంతి రవికిషోర్ తీసిన 'యువసేన' రచయితగా తనకు తొలి చిత్రమనీ, ఈ చిత్రంలో ఐదు పాటలకు తానే సాహిత్యం అందించాననీ చెప్పారు. క్లైమాక్స్ సాంగ్ కు రాయడం తనకు మంచి అనుభూతినిచ్చిందని అన్నారు. మిక్కీ జె.మేయర్ మాట్లాడుతూ, హీరో రామ్ సినిమాకి సంగీతం అందించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందనీ, 'కొత్త బంగారులోకం' తర్వాత గ్యాప్ తీసుకుని ఎంతో కమిట్ మెంట్ తో ఈ సినిమాకి సంగీతం అందించాననీ అన్నారు. తన పాటలు ఎలా చిత్రీకరిస్తున్నారో చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం కూడా కలిగిందన్నారు. పాటలన్నీ బాగా వచ్చాయనీ, వేర్వేరు గాయకులతో ఈ పాటలు పాటించాననీ అన్నారు.


Click it and Unblock the Notifications











