Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగాభిమానుల నుంచి తీవ్రపరిణామాలు..హెచ్చరిక
అలాంటి ప్రయత్నం చేస్తే మెగాభిమానుల నుంచి తీవ్రపరిణామాలు ఎదుర్కొవలసి వస్తుంది' అని హెచ్చరించారు తీన్ మార్ నిర్మాత గణేష్ బాబు.ఇంతకీ ఏమిటా ప్రయత్నాలు అంటే ఈ చిత్రం పైరసీ చేయటం అని అన్నారు.పవన్కళ్యాణ్ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై తాను నిర్మించిన 'తీన్మార్' చిత్రం తొలి రోజునే 9 కోట్ల 48 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాత గణేష్బాబు చెప్పారు. ఆయన మాట్లాడుతూ 'పవన్కళ్యాణ్ కెరీర్లోనే ఇది పెద్ద హి ట్. ఆయన అభిమానులు చిత్రాన్ని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. నైజాం ఏరియాలో కోటి డెబ్బయి లక్షల రూపాయల షేర్ని మా సినిమా సాధించింది. పరిశ్రమలోని అన్ని రికార్డులను ఈ చిత్రం తిరగరాస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తీసినందుకు నా జన్మ ధన్యమైంది. నాకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాను పైరసీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.అలాంటి ప్రయత్నం చేస్తే మెగాభిమానుల నుంచి తీవ్రపరిణామాలు ఎదుర్కొవలసి వస్తుంది అన్నారు.