Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గబ్బర్ సింగ్ నిర్మాత కోడి గుడ్డు స్టోరీ..!
పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తీన్ మార్' చిత్రాన్ని నిర్మించింది కూడా ఇతడే. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో చిత్రాని కూడా నిర్మిస్తున్నాడు ఈ నిర్మాత.
బండ్ల గణేష్ కోడిగుడ్డు స్టోరీ ఏమిటంటే....ఇతగాడు తాజాగా నేషనల్ ఎగ్ సెంటర్ కమిటీ(ఎన్ఇసిసి) మెంబర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ''అందరి సహకారంతో చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా పేరు సంపాదించుకున్న నేను నేషనల్ ఎగ్ సెంటర్ కమిటీ మెంబర్గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది, 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల పాటు ఎన్ఇసిసి మెంబర్గా నా సేవల్ని అందిస్తాను'' అన్నారు.
పవర్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, శృతి హీసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి 'యాక్షన్' లేదే 'బాద్షా' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.