Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాణం దర్శకుడితో బ్రహ్మానందం తనయుడు
దరాబాద్ : నారా రోహిత్తో 'బాణం' చిత్రం రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చైతన్య దొందులూరి. తాజాగా ఈ దర్శకుడు 'బాసంతి' అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో బ్రహ్మానందం తనయుడు గౌతంను హీరోగా ఎంచుకున్నాడు. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
బాణం చిత్రానికి మంచి టాకే వచ్చినా...బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్లు కురిపించలేక పోయింది. అయితే చైతన్యకు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందాయి. గౌతం ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. ఆయన చివరగా నటించిన 'పల్లకిలో పెళ్లి కూతురు', 'వారెవా' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. మరి 'బాసంతి' చిత్రం వీరిద్దరి కెరీన్ ని మలుపు తిప్పుతుందో? లేదో? చూడాలి.
వీర్య దానం, అద్దెగర్భం గురించి చర్చించే కాన్సెప్టుతో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'వికీ డోనర్'. విభిన్న కథాంశంతో రూపొందిన ఈచిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈచిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో గౌతం నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్