Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గాయం సీక్వెల్ లాంటిది ఎవరూ చేయలేదు
ఇండియాలో ఈ తరహాలో సీక్వెల్ ఎవరూ చేయలేదు. జగపతి బాబు కెరీర్ను మలుపు తిప్పిన 'గాయం' చిత్రానికి పర్ఫెక్ట్ సీక్వెల్ ఇది. మా గురువు రాంగోపాలవర్మ చిత్రానికి నేను సీక్వెల్ చేయడం, ఆయన సమర్పణలో ఈ సినిమా తయారవుతుండటం నా అదృష్టం అంటున్నారు దర్శకుడు ప్రవీణ్శ్రీ. జగపతి బాబు, విమల రామన్ జంటగా ప్రవీణ్శ్రీ దర్శకత్వంలో కర్త క్రియేషన్స్ పతాకంపై డా.ధర్మకర్త సి. నిర్మిస్తున్న 'గాయం-2' చిత్రం రెండో షెడ్యూల్ మే 3 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.ఈ విషయాన్ని మీడియా సమావేసం ఏర్పాటు చేసి తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా.ధర్మకర్త మాట్లాడుతూ 'ఓ కొత్త స్టైల్లో ఉండే యాక్షన్ సినిమా ఇది. రాంగోపాలవర్మ శిష్యుడైన ప్రవీణ్శ్రీ ఈ చిత్రాన్ని వినూత్నంగా తెరకు ఎక్కిస్తున్నారు. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో అయిదు పాటలు ఉన్నాయి. మా కోరిక మేరకు ఇళయరాజా ఓ పాట పాడటం విశేషం' అన్నారు. ఇటీవల బ్యాంకాక్లో 20 రోజుల పాటు జరిగిన షూటింగ్లో యాక్షన్ ఎపిసోడ్తో పాటు జగపతి బాబు, విమల రామన్ లపై రెండు పాటలు కూడా చిత్రీకరించారు. ఇక ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం హిస్టరీ ఆఫ్ వయలెన్స్ ఆధారంగా తయారవుతోంది. అందులోని మేజర్ హైలెట్స్ తో కథనం అల్లారని అంతటా వినపడుతున్న సంగతి తెలిసింది.