Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా పిలకలు టచ్ ఐతే ఇలాంటి మాటలే వస్తాయి: విజయ్ దేవరకొండ కేక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నమోదైంది. దీంతో సినిమా విడుదలైన అన్ని చోట్లా థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల ముందుగా అడ్వాన్డ్స్ బుకింగ్ చేసుకుంటే తప్ప టిక్కెట్లు దొరకని పరిస్థితి ఉంది.
సినిమాపై మరింత ఆసక్తి పెంచడంలో భాగంగా చిత్ర బృందం డైలాగ్ ప్రోమోలను విడుదల చేసింది. ఇందులో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఆ సీన్లు చూసి మీరూ నమ్ముకోండి మరి.
సినిమా విడుదలైన రెండో రోజు డిస్ట్రిబ్యూటర్స్ 100 శాతం తమ పెట్టుబడి రికవరీ చేసుకుని లాభాల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ నెల 19న బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఇందుకు వేదిక కాబోతోంది. ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
'గీత గోవిందం' తొలి రోజు రూ. 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజుతో రూ. 25 కోట్ల మార్కును దాటేసింది. నైజాం ఏరియాలో ఆడియన్స్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 50 స్క్రీన్లను అదనంగా యాడ్ చేశారంటే సినిమాకు ఎంత డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.