twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గీతాంజలి’ సీక్వెల్ వస్తోంది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ ఏడాది వచ్చిన కామెడీ, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘గీతాంజలి' బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. అంజలి ప్రధాన పాత్రలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ‘గీతాంజలి' చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్.....సీక్వెల్ కు దర్శకత్వం వహించబోతున్నారు. క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ అధినేత చినబాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రతిపాదనల దశలోనే ఉంది. తారగణం ఇతర వివరాలు ఫైనలైజ్ కావాల్సి ఉంది.

    Geethanjali sequel in 2015

    ఈ చిత్రానికి శ్రీనివాస్ వెలిగొండ డైలాగ్స్ అందించబోతున్నారు. త్వరలోనే ఇతర టెక్నీషియన్స్ వివరాలు వెల్లడి కానున్నాయి. 2015లో ఈచిత్రం ప్రారంభం కానుంది. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టెన్ చేసేలా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

    ‘గీతాంజలి' చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డి పెర్ఫార్మెన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అయితే సీక్వెల్ లో వీరు ఉంటారా? లేక దర్శకుడు కొత్త నటీనటుల తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.

    English summary
    Geethanjali sequel in 2015. Raj Kiran, who directed Geethanjali will be directing this film also. China Babu of Crazy Media Productions is going to produce this flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X