Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహానటి డిలీటెడ్ సీన్: ఆ రేఖ అందరి ముందు అలా చెప్పింది.. సావిత్రి కుటుంబ సమస్యలు!
సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం మంచి విజయం సాధించింది. నాగ అశ్విన్ లెజెండరీ నటి సావిత్రి గాధని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. సావిత్రి జీవితం మొత్తం సినిమాగా తీయాలంటే మూడుగంటల సమయం సరిపోదు.
చిత్రం నుంచి తొలగించిన సన్నివేశాల్ని మహానటి చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. సావిత్రి.. జెమినీ గణేశన్ ని వివాహం చేసుకుని పిల్లలు పుట్టాక ఎదురైన సమస్యలని అందంగా చిత్రీకరించారు.
సావిత్రికి జన్మించిన కుమార్తె విజయ చాముండేశ్వరి. జెమినీ గణేశన్ మరొక భార్య పుష్పవల్లికి జన్మించిన కుమార్తె రేఖ. వీరు స్కూల్ లో చదువుతున్న సమయంలో జరిగిన ఓ సంఘటనని ఈ సన్నివేశం లో చూపించారు. సావిత్రి వద్దకు విజయ వచ్చి.. అమ్మా ఆ రేఖ జెమినీ గణేశన్ తన నాన్న అని అందరిముందు చెప్పింది. నువ్వు వెంటనే స్కూల్ కు వచ్చి జెమినీ గణేశన్ నాకు మాత్రమే నాన్న అని చెప్పు అని అంటుంది. ఆయన రేఖకు కూడా నాన్నే అమ్మా. మనది పెద్ద కుటుంబం అని సావిత్రి విజయని బుజ్జగించే సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంది.