Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'మహానటి' తీవ్ర నిరాశ మిగిల్చింది.. నటి సంచలన వ్యాఖ్యలు.. ఎమోషనల్ ఫోటోలు!
మహానటి చిత్రం విడుదలై అంతటా ప్రభంజనం సృష్టిస్తోంది. మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం కావడంతో సినీ అభిమానులంతా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. దర్శకుడు నాగ అశ్విన్ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులకు కూడా మహానటి చిత్రం విషయంలో ఎలాంటి నిరాశలేదు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది. ఇక మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో నటించి మెప్పించాడు. సమంత, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఏఎన్నార్ గా నాగ చైతన్య, ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు కామియో రోల్స్ చేసారు. మహానటి చిత్రం అందరిని మెప్పిస్తూన్నా ఒక్కరికి మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. దుల్కర్ సల్మాన్ మాజీ భార్య పుష్పవల్లి పాత్రలో బిందు చంద్రమౌళి నటించింది. ఆమెకు ఎదురైన నిరాశ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధ్యమైనంతవరకు అందరిని
సావిత్రి జీవితంలో ఎక్కువ భాగం సినిమాలతోనే గడిచింది. ఆమె సినీ కెరీర్ అనేక మంది స్టార్స్ తో ముడి పడి ఉంది. ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులంతా ఆమెతో కలసి నటించిన వారే. దర్శకుడు నాగ అశ్విన్ సాధ్యమైనంత వరకు అందరిని చూపించడానికి ప్రయత్నం చేసారు.
ఆమెకు తీవ్ర నిరాశ
నటి బిందు చంద్రమౌళి ఈ చిత్రంలో జెమినీ గణేశన్ మాజీ భార్య పుష్పవల్లి పాత్రలో నటించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ దర్శకుడు నాగ అశ్విన్ చిత్ర రన్ టైమ్ ని దృష్టిలో పెట్టుకుని బిందు చంద్రమౌళి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తొలగించారు. దీనితో ఆమె తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తోంది. తక్కువ సమయం ఉన్నప్పటికీ తన పాత్ర చాలా కీలకమని అంటోంది.
బాలీవుడ్ అందాల నటి తల్లే ఈమె
90 లలో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన నటి రేఖ తల్లే ఈ పుష్పవల్లి. పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు రేఖ కాగా మరొకరు రాధా. రాధా ప్రస్తుతం యుఎస్ లో ఉంటోంది.
దర్శకుడి నిర్ణయం అయినప్పటికీ
తన పాత్రని తొలగించాలనే నిర్ణయం దర్శకుడు తీసుకున్నప్పటికీ తాను తీవ్ర నిరాశలో ఉన్నానని బిందు చంద్రమౌళి తెలిపింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రతో తనకు సన్నివేశాలు కూడా ఉన్నాయని బిందు తెలిపింది.
ఎమోషనల్ పిక్స్
తన పాత్రకు సంబందించిన కొన్ని ఫోటోలని బిందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దుల్కర్ సల్మాన్ తో బిందు సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉన్నట్లు ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.