Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జెనిలియా కథ ఏమైంది?
కథ పేరుతో నిర్మితమౌతున్న ఓ చిత్రం జెనీలియా టీచర్ గా ప్రధాన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అదిక బాగం అరకు వ్యాలీలో జరిగింది. థ్రిల్లర్ ఫార్మేట్ లో జరిగే ఈ కథ ద్వారా శ్రీనివాస్ రాగ అనే దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. అలాగే ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో తమిళ కుర్రాడు అరుణ్ నటిస్తున్నాడు. అతను తమిళ హ్యాపీడేస్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతనిది రచయిత పాత్ర..నేను రాసే కథే ఈ చిత్రం అంటున్నాడు. ఇప్పటికి 50% పూర్తి చేసుకున్న ఈ సినిమా పై అంతటా మంచి అంచనాలే ఉన్నాయ్. ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది వంటి విభిన్న తరహా చిత్రాలు నిర్మించిన జస్ట్ యల్లో బ్యానర్ వారు ఇప్పుడు కథ పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలాగే నిర్మాత గుణ్ణం గంగరాజు సినిమా గురించి మాట్లాడుతూ ఈ కథ చిత్రం ఓ థ్రిల్లర్ అని అన్నారు. అమ్మ చెప్పింది చిత్రం రిలీజైన మూడేళ్ళ తర్వాత ఈ సినిమా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ప్లాన్ చెస్తున్నాం..ఈ చిత్రం బేసిక్ గా థ్రిల్లర్ అయినా ప్రేమ కంటెంట్ అండర్ కరెంట్ గా ఉంటుంది అన్నారు. ఇక దర్శకుడు శ్రీనివాస్ గతంలో కోడిరామకృష్ణ వద్ద నవ్వుతూ బ్రతకాలరా, త్రినేత్రుడు, జెండా చిత్రాలకు పనిచేసారు.సంగీత దర్శకుడుగా బాలచంద్రన్ పనిచేస్తున్న్రు. ఆయన గుణ్ణం గంగరాజుగారి సీరియల్స్ కి పనిచేసారు. బ్రహ్మాస్త్రం సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం హిల్ స్టేషన్ నేపధ్యంలో జరుగుతుంది. అందుకే అరుకులో ఎక్కువ భాగం షూట్ చేస్తారు. దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్ ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫి వంటి సీనియర్స్ కీలక పాత్రల్లో నటించనున్నారు. గుణ్ణం గంగరాజు డైలాగులు అందించనున్నారు.