Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లోకల్ మీడియాను కడిగిపారేసిన జెనిలియా
రానా సరసన తాను హీరోయిన్గా నటించిన 'నా ఇష్టం' చిత్రం ప్రచార కార్యక్రమంలో బాగంగా హైదరాబాద్ వచ్చింది. ఆమె వచ్చినందుకు ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో జెనీలియాకు మీడియా వ్యక్తులు అడిగిన ఒక ప్రశ్న చాలా కోపం తెప్పించింది. ఆ ప్రశ్న మరేదో కాదు భూకబ్జాకు సంబంధించిన వ్యవహారం. దానిపై జెనిలియా మండిపడుతూ.. ''భూకబ్జా వ్యవహారంలో నా ప్రమేయం ఉన్నట్టుగా తెలిపే ఎలాంటి పత్రాలు కానీ స్టేట్మెంట్ కానీ నాకు అందలేదు. న్యూస్ పేపర్స్ ద్వారానే నాకు ఆ సంగతి తెలిసింది. అంజనీపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు(హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్ధ) నేను బ్రాండ్ ఎంబాసిడర్ను కాదు కదా ఆ కంపెనీకి చెందిన బోర్ట్ ఆఫ్ డైరక్టర్ను కూడా కాను. వారి కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చాను. అంతకుమించి ఆ కంపెనీతో నాకెలాంటి సంబంధం లేదు. మీడియా చాలా బాధ్యతాయుతంగా వార్తలు రాయాలి. ఎలాంటి భూకబ్జా వ్యవహారాల్లో నా ప్రమేయం లేదు'' అని జెనీలియా వివరించింది. ఇక ఆమె నా ఇష్టం చిత్రం ఉగాది రోజు అంటే మార్చి 23న విడుదలైంది. సినిమా మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.