Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
జర్మనీలో అనూష్క‘రుద్రమదేవి’
హైదరాబాద్ :దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. అనుష్కను 'రుద్రమదేవి'గా ఆవిష్కరించే పనిలో భాగంగా ఆయన జర్మనీ వెళ్లారు. గుణశేఖర్తో పాటు కెమెరామేన్ అజయ్ విన్సెంట్, స్టీరియోగ్రాఫర్ ఫ్లోరియన్ మేయర్ కూడా జర్మనీ వెళ్లారు. భారతదేశంలోనే తొలి స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా 'రుద్రమదేవి'ని గుణశేఖర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం జర్మనీలోని 3డి కెమెరాలతో అక్కడి ఆధునిక సాంకేతిక విలువలను జోడించి 3డి టెక్నీషియన్స్తో గుణశేఖర్ ఓ టెస్ట్ షూట్ను చేస్తున్నారు.
వారం రోజుల పాటు అక్కడే ఈ వర్క్ జరుగుతుందని గుణశేఖర్ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో 'రుద్రమదేవి' ఓ లాండ్మార్క్గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంజేశారు. అరుంధతి చిత్రం తర్వాత అనుష్కను హీరోయిన్ గా పెట్టాలని డిసైడ్ అయ్యాను. అరుంధతి, ఈగ చిత్రాలను ప్రేక్షకులు అపురూపంగా ఆదరించడం వలన మంచి సినిమా తీస్తే తప్పకుండా మన ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనే నమ్మకం ఏర్పడి ఇంతటి భారీ ప్రాజెక్టును సొంతగా నిర్మించడానికి రంగంలోకి దిగాను అని తెలిపారు. దర్శకుడిగా నాకు ఇప్పటి వరకు తృప్తి లేదు. ఈ చిత్రం ద్వారా నేను సంతృప్తి చెందుతాను అనే నమ్మకం ఉంది. స్క్రిప్టు పక్కాగా రెడీ అయింది. సెట్స్ కూడా రెడీ అవుతున్నాయి అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.
2013 ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని గుణశేఖర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చే వరకు అంతటి దేశ భక్తుడి గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. ఈచిత్రం తర్వాత రుద్రమ దేవి ఘనత గురించి అందరూ చెప్పుకుంటారు అనే నమ్మకం వ్యక్తం చేసారు. భారతదేశ చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించబోతున్నాం అని తెలిపారు.
ఇండియాలో తొలి స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం ద్వారా దర్శకుడు గుణశేఖర్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈచిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్ : పద్మశ్రీ తోట తరణి, సినిమాటోగ్రఫీ : అజయ్ విన్సెంట్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కన్నన్(ప్రసాద్ ఇఎఫ్ఎక్స్), ఎడిటింగ్ : శ్రీకర ప్రసాద్, స్క్రిప్టు అసోసియేట్ : తోట ప్రసాద్, స్టోరీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ : ముదిగొండ శివప్రసాద్, కాస్టూమ్ డిజైనర్ : నీతా లుల్ల(జోధా అక్భర్ ఫేం), మధుబాబు, ఎం.బి.ఎస్.ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం : గుణశేఖర్.