Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'గోల్కొండ హైస్కూల్' గురించి
'అష్టాచమ్మా' తో దర్శకుడుగా తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాజాగా 'గోల్కొండ హైస్కూల్' అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కథ క్రికెట్ ఆట నేఫద్యంలో జరుగుతుంది. సుమంత్ హీరోగా చేస్తున్న చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం టైటిల్ కి ఆటలు మా హక్కు అని ట్యాగ్ లైన్ పెట్టారు.
పి.రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర సమర్పకులు సురేష్బాబు మాట్లాడుతూ ..ఈ సినిమా నాకు బాగా నచ్చింది. పాఠశాలకు ఆటస్థలం ఎంత ముఖ్యమో ఈ సినిమా చూశాకా ప్రతి ఒక్కరికి తెలుస్తుందని అన్నారు.
ఆ తర్వాత హీరో సుమంత్ మాట్లాడుతూ '' నా జీవితంలో మళ్లీ ఇలాంటి పాత్ర రాదు. ఈ సినిమా కోసం కొంత మంది హీరోల్ని సంప్రదించారు. వాళ్లు అంగీకరించలేదు. ఈ సినిమా చూశాకా నటించలేనందుకు వారు బాధపడతారు. బాలీవుడ్లో 'లగాన్', 'చక్దే' సినిమాల తర్వాత అక్కడి ట్రెండ్ ఎలా మారిందో ఈ సినిమా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో కూడా మార్పు వస్తుందని చెప్పారు. స్కూల్లో జరిగే క్రికెట్ టోర్నమెంటు నేపథ్యంగా జరిగే కథ ఇది. హరిమోహన్ పరువు రచించిన 'ది మెన్ విత్ఇన్' నవల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుబ్బరాజు, షఫీ, రవిప్రకాశ్, ఝాన్సీ, హేమలతోపాటు కొంతమంది పాఠశాల విద్యార్థులూ నటించారు. కెమెరా: సెంథిల్కుమార్, సంగీతం: కల్యాణి మాలిక్, పాటలు: సీతారామశాస్త్రి, కళ: రవీందర్, కూర్పు: శ్రావణ్.