Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ సంవత్సరం గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుకి ఎంపికైన చిత్రం
తొలి చిత్రంతోనే సంచలనాలు సృష్టించిన నవ దర్శకులను సత్కరించే గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డు ఈ సంవత్సరం హిందీ దర్శకురాలు అనుష రిజ్వీ దక్కించుకుంది. అమీర్ ఖాన్ నిర్మాణ సారద్యంలో రైతుల ఆత్మహత్యల నేపద్యంలో తెరకెక్కిన పిప్లి లైవ్ చిత్రానికి గాను ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. దేశ వ్యాప్తంగా 16 చిత్రాలు పోటి పడగా వారిలో అనుష ఎంపికయ్యారు. అవార్డు కింద 1.50 లక్షల నగదు జ్ఞాపిక అందజేస్తారు. ఆగుస్ట్ 12 న చెన్నై లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం జరుగుతుంది. నటుడు రచయత గొల్లపూడి మారుతిరావు అయన కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ స్మృత్యర్ధం తోలి సినిమాతోనే ప్రతిభ కనబరిచిన దర్శకులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఎన్ డి టివిలో జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు..వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలైకా షెనాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.