Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మోహన్కృష్ణకు మరో అవార్డు
ప్రఖ్యాత రచయిత చలం రాసిన దోషగుణం కథను గ్రహణం పేరుతో తెరకెక్కించి తొలి చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా జాతీయ అవార్డును అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మకమైన గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ప్రదానోత్సవం శనివారం సాయంత్రం (ఆగస్టు 12న) చెన్నైలో ఘనంగా జరిగింది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉత్తమ దర్శకుడు మోహనకృష్ణను ఘనంగా సత్కరించారు.
తన మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి గొల్లపూడి శ్రీనివాస్ దుర్మరణం చెందారు. అప్పటి నుండి తమ కుమారుడి స్మారకంగా గొల్లపూడి మారుతీరావు ప్రతి యేటా జాతీయ స్థాయిలో ఉత్తమ తొలి చిత్ర దర్శకులకు ఈ అవార్డును, లక్షన్నర రూపాయల నగదును అందజేస్తున్నారు. గ్రహణం చిత్రంతో చక్కని ప్రతిభ కనబర్చిన మోహనకృష్ణను ఈ ఏడాది ఎంపిక చేశారు. తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన అనేకమంది ప్రముఖులు, బాలీవుడ్ నిర్మాత రమేశ్ సిప్పి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ అవార్డుకు అర్హత సాధించడం, ఆపై తన అభిమాన నటుడైన అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం తనకు మధురానుభూతి మిగిల్చిందని ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు.