Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పక్కరాష్ట్రాలకు పాకిన తెలుగు ‘రొమాన్స్’
హైదరాబాద్: లవర్ బాయ్ ప్రిన్స్ ముఖ్యపాత్రలో, డింపుల్ చోపడే, మానస హీరోయిన్లుగా డార్లింగ్ స్వామి దర్శకత్వంలో, గుడ్ సినిమా గ్రూప్, మూరుతి మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించిన రొమాన్స్ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్గా విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రాన్ని కన్నడ, హిందీ భాషల్లో గుడ్ సినిమా గ్రూప్ నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నటీనటులు ఇందులో నటించనున్నారు. అంతే కాకుండా సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. గ్రాండ్గా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్ర విశేషాల గురించి గుడ్ సినిమా గ్రూప్ నిర్మాతలు మాట్లాడుతూ....తెలుగులో నిర్మించిన రొమాన్స్ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినా ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఆదరించారు. మా బ్యానర్లో వచ్చి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. ఇప్పుడీ సినిమాను కన్నడ, హిందీ భాషల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించేదుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేస్తాం. అని అన్నారు.