గోపాల గోపాల: బస్సులో పైరసీ బాగోతం...
హైదరాబాద్: ‘గోపాల గోపాల' సినిమా కేవలం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే కాదు...కొన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. అయినా ప్రైవేట్ బస్సు ట్రావెల్స్కు...ఈ సినిమాకు లింకేటి? అనుకుంటున్నారా. అయితే మీరు ఈ పైరసీ భాగోతం గురించి తెలుసుకోవాల్సిందే.
‘సంక్రాంతి' పండగ సందర్భంగా సొంతూర్లకు వెలుతున్న వారిని ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వారు ‘గోపాల గోపాల' పైరసీ సీడీలను బస్సుల్లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఈ బాగోతం బయట పడటం అందరినీ షాక్కు గురి చేసింది. బస్సులో ఉన్న పవర్స్టార్ అభిమాని ఈ బండారం బయట పెట్టినట్లు సమాచారం. వెంటనే యాంటీ పైరసీ టీమ్స్ రంగంలోకి దిగాయి.

సినిమా వివరాల్లోకి వెళితే....
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈచిత్రం బాగా ఆడుతోంది. చెన్నై బాక్సాఫీసు వద్ద కూడా దుమ్ము రేపుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్బాబు, శరత్ మరార్ నిర్మాతలు. అయితే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయని టాక్.
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్ప్లే: కిశోర్కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.


Click it and Unblock the Notifications











