twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ నెక్ట్స్ జూన్ నుంచి ప్రారంభం

    By Srikanya
    |

    హైదరాబాద్ : రీసెంట్ గా వివాహం చేసుకున్న గోపీచంద్ మెల్లిగా తన తదుపరి ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నారు. దేవకట్టా దర్శకత్వంలో కమిటైన చిత్రం జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు స్క్రిప్టు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జి.ఆనంద ప్రసాద్ తమ భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

    నాగచైతన్య హీరోగా దేవా కట్టా డైరక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య ' చిత్రం రిలీజ్ బాగా లేటయ్యేటట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు దేవా కట్టా తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సారి యాక్షన్ హీరో గోపీచంద్ ని గోపీచంద్ ని డైరక్ట్ చేయనున్నారు. ఈ విషయమై దేవకట్టా స్వయంగా ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు.

    దేవకట్టా ట్వీట్ లో ... "నా తదపరి చిత్రం గోపీచంద్ తో ఉంటుంది. అది ఓ ఓ యాక్షన్ ఎంటర్టైనర్, మే నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ", అని ట్వీట్ చేసారు. అలాగే... 'ఆటోనగర్ సూర్య' విడుదల గురించి చెప్తూ.. " మీ అందరి లాగే నేను కూడా ఆటోనగర్ సూర్య విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ", అన్నారు.

    గోపీచంద్ హీరోగా చేసిన 'సాహసం ' విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్రం పూర్తిగా ఎండ్వెంచర్స్ తో నడుస్తుంది. నిధి నిక్షేపాల అన్వేషణే ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా తయారవుతోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మైంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ, లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Gopichand who got married recently is all set to sign a new project under Deva Katta's direction. G.Anand Prasad will be producing this film which will go to floors in June. Gopichand is currently busy with Sahasam which is getting ready for release. The film is directed by Chandrasekhar Yeleti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X