Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గోపీచంద్, నయనతార చిత్రం టైటిల్ ఖరారు
గోపీచంద్, నయనతార కాంబినేషన్ లో భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ గా 'జగన్ మోహన్ ఐపియస్' అని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో గోపీచంద్ ఐఎఎస్ అధికారిగా కనిపించనున్నారు. 'ఆంధ్రుడు', 'శౌర్యం', 'గోలీమార్' చిత్రాల్లో పోలీసుగా అదరకొట్టిన గోపీచంద్ మరో సారి పోలీసుగా తన సత్తా చూపనున్నాడని చెప్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్సిటీలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. దీంతో తొలి షెడ్యూల్ పూర్తయింది.
నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ...ఇదొక మాస్ ఎంటర్టైనర్. గోపీచంద్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. దర్శకుడు భూపతి ఈ సినిమాను కొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారు. కథ, కథనం, గోపీచంద్ పాత్ర చిత్రణ అన్నీ కొత్తగా ఉంటాయి. ఇందులో గోపీచంద్ ఐపీఎస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధాన దృశ్యాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరిస్తాం. జూన్లో విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తామని తెలిపారు.
సమర్పకుడు కొమర వెంకటేష్ మాట్లాడుతూ... గోపీచంద్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఐపీఎస్గా ఆయన ఒక శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్నారు. ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. గోపీచంద్, నయనతార మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్ని ఇటీవలే తెరకెక్కించాం. అవి ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టేలా ఉంటాయని అన్నారు.
గోపీచంద్, నయనతార తొలిసారి కలిసి నటిసున్న ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేసే సన్నివేశాలతో రూపొందుతోంది. కోట శ్రీనివాసరావు, నాజర్, సాయాజీషిండే, రఘుబాబు, అశుతోష్రాణా, టార్జాన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: తమన్, కెమెరా: శక్తి శరవణన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.