Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోపీచంద్, నయనతార చిత్రం టైటిల్ ఖరారు
గోపీచంద్, నయనతార కాంబినేషన్ లో భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ గా 'జగన్ మోహన్ ఐపియస్' అని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో గోపీచంద్ ఐఎఎస్ అధికారిగా కనిపించనున్నారు. 'ఆంధ్రుడు', 'శౌర్యం', 'గోలీమార్' చిత్రాల్లో పోలీసుగా అదరకొట్టిన గోపీచంద్ మరో సారి పోలీసుగా తన సత్తా చూపనున్నాడని చెప్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్సిటీలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. దీంతో తొలి షెడ్యూల్ పూర్తయింది.
నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ...ఇదొక మాస్ ఎంటర్టైనర్. గోపీచంద్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. దర్శకుడు భూపతి ఈ సినిమాను కొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారు. కథ, కథనం, గోపీచంద్ పాత్ర చిత్రణ అన్నీ కొత్తగా ఉంటాయి. ఇందులో గోపీచంద్ ఐపీఎస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధాన దృశ్యాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరిస్తాం. జూన్లో విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తామని తెలిపారు.
సమర్పకుడు కొమర వెంకటేష్ మాట్లాడుతూ... గోపీచంద్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఐపీఎస్గా ఆయన ఒక శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్నారు. ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. గోపీచంద్, నయనతార మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్ని ఇటీవలే తెరకెక్కించాం. అవి ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టేలా ఉంటాయని అన్నారు.
గోపీచంద్, నయనతార తొలిసారి కలిసి నటిసున్న ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేసే సన్నివేశాలతో రూపొందుతోంది. కోట శ్రీనివాసరావు, నాజర్, సాయాజీషిండే, రఘుబాబు, అశుతోష్రాణా, టార్జాన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: తమన్, కెమెరా: శక్తి శరవణన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.