Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జూ ఎన్టీఆర్, ప్రభాస్ లను ఫ్యాలో అవుతున్న గోపిచంద్!
ప్రస్తుతం టాలివుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోస్ ఎవరబ్బా అంటే ముందుగా గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్. మొదట్లో వీరు మాస్ క్యారెక్టర్స్ ఇష్టపడి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కి కంత్రి సినిమా, ప్రభాస్ కి ఛత్రపతి సినిమా తర్వాత మరి ఏ ఇతర మాస్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో కాస్త డీలాపడ్డ ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మాస్ కి భిన్నంగా నటించేందుకు అందుకు ఫ్యామిలి, రొమాంటిక్ జనరేషన్ కు తగ్గ కథలను ఎంచుకొని మరీ సినిమాలో నటించే ప్రయాత్నాలు ముమ్మరంగి సాగుతున్నాయి. అందులో బాగమే ప్రస్తుతం విడుదలకు సిద్దం కాబోతున్న ప్రభాస్ డార్లింగ్, ఎన్టీఆర్ నటిస్తున్న బృందావనం.
మరి ఇదే కోవలో యజ్ఝం, లక్ష్యం, వంటి చిత్రాలతో పక్కా మాస్ హీరోగా పేరు పొందిన హీరో గోపిచంద్ కూడా మాస్ నుండి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నట్టు సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. గోపిచంద్ కూడా తను ముందు ముందు నటించబోవు సినిమాలు స్టోరిలైన్ ఎక్కువగా ఉండేటట్లు, తక్కువ యాక్షన్ ఎక్కువ డ్రామ ఉండేటట్లు స్క్రిప్ట్ రాసేవారికి ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి మరి రాయించుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 'గోలిమార్" చిత్రంలో నటిస్తున్న గోపిచంద్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు సమాచారం. మరైతే వీరిలో ఎవరు మాస్ హీరోయిజం నుండి బయటపడి ఒరిజినల్ హీరోగా పేరుతెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే.