Don't Miss!
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- News గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
తొలిగిన అడ్డంకులు.. ఫస్ట్ షో ఫిక్స్ అంటూ క్రాక్ డైరెక్టర్ ట్వీట్ వైరల్
మాస్ మహారాజా రవితేజ అభిమానులు నేటి ఉదయం నుంచి ఎంతో నిరాశతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెరపై రవితేజను చూస్తామా? అని ఎదురుచూడసాగారు.కానీ వారు ఆశలు ఆవిరి అవుతూనే వచ్చాయి. ఫ్యాన్సీ షోలు, బెనిఫిట్ షోలు ఇలా అన్ని క్యాన్సిల్ అయ్యాయి. కనీసం మార్నింగ్ షో వరకు అయినా సమస్యలన్నీ తొలగిపోయి సినిమా వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ మ్యాట్నీ షో కూడా వాయిదా రద్దు చేసేశారు.
నిర్మాత ఠాగూర్ మధు చేసిన అప్పులు, అంతకు ముందు సినిమాల విషయంలో తేలని లెక్కల వల్ల ఇప్పుడు క్రాక్ సినిమాపై ప్రభావం పడింది.టెంపర్ రీమేక్ అయోగ్య విషయంలో ఈ గొడవలు జరిగాయని ఒకరు.. స్పైడర్ సినిమా విషయంలో ఈ గొడవ జరిగిందని ఒకరు అంటున్నారు. మొత్తానికి ఈ గొడవ ఇక తేలదు.. సినిమా విడుదల అవ్వదని అందరూ అనుకున్నారు. సమస్య వచ్చింది ఆరు కోట్లు వల్ల అని కొందరు కాదు పది కోట్లు అంటూఇంకొందరు రాసుకొచ్చారు.
ఏది ఎలాగున్నా కూడా రవితేజ అభిమానులకు మాత్రం ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఫస్ట్ షో నుంచి క్రాక్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మేరకు డైరెక్టర్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. అన్ని సమస్యలు తొలగిపోయాయ్.. ఫస్ట్ షో నుంచి క్రాక్ వస్తుందంటూ గోపీచంద్ మలినేని ట్వీట్ చేయడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. మొత్తానికి క్రాక్ విడుదలపై వచ్చిన రూమర్లన్నీ చెదిరిపోయాయి.