Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోపీచంద్.. సెంటిమెంట్ ఈ సారి వర్కవుట్ అవుతుందా?
గోపిచంద్ కి ఓ విచిత్రమైన టైటిల్ సెంటిమెంట్ ఉంది. అతని సినిమాల చివరన "0" ఉండాల్సిందే. వరసగా యజ్ఞం, రణం, శౌర్యం, లక్ష్యం అంటూ హిట్ కొట్టారు. అయితే శంఖం చిత్రంతో అది రివర్స్ అయింది. అయినా తన సెంటిమెంట్ ని విడిచి పెట్టేటట్లు గోపీచంద్ కనపడటం లేదు. తన తాజా చిత్రానికి రౌద్రం అనే టైటిల్ పెట్టుకున్నారు. గణేష్ ఇందుకూరి నిర్మించే ఈ చిత్రాన్ని శ్రీవాస్ డైరక్ట్ చేయనున్నారు. శ్రీవాస్...కొద్ది నెలల క్రిందట దిల్ రాజు బ్యానర్ లో రామ్ హీరోగా రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని రూపొందించారు. అయితే అది భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ని వరసగా పేర్చుకుంటూ వచ్చిన ఈ చిత్రం శ్రీవాస్ కి మరో సినిమా ఇప్పించలేకపోయింది. అయితే గోలీమార్,శంఖం చిత్రాలతో ప్లాపుల్లో ఉన్న గోపీచంద్..కి తనకు లక్ష్యం వంటి హిట్టిచ్చిన డైరక్టర్ అయితే తిరిగి లైన్ లో కెరీర్ ని పెడతారనిపించి పిలిపించి సినిమా ఇచ్చారని తెలుస్తోంది. అందులోనూ తన సెంటిమెంట్ కు తగ్గట్లుగా టైటిల్ కూడా పెట్టాడని కూడా కమిటయ్యారని తెలుస్తోంది. ఇక అనుష్క కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తే మరింత బలం వస్తుందని ఆశిస్తున్నాడు.