Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గోపీచంద్.. సెంటిమెంట్ ఈ సారి వర్కవుట్ అవుతుందా?
గోపిచంద్ కి ఓ విచిత్రమైన టైటిల్ సెంటిమెంట్ ఉంది. అతని సినిమాల చివరన "0" ఉండాల్సిందే. వరసగా యజ్ఞం, రణం, శౌర్యం, లక్ష్యం అంటూ హిట్ కొట్టారు. అయితే శంఖం చిత్రంతో అది రివర్స్ అయింది. అయినా తన సెంటిమెంట్ ని విడిచి పెట్టేటట్లు గోపీచంద్ కనపడటం లేదు. తన తాజా చిత్రానికి రౌద్రం అనే టైటిల్ పెట్టుకున్నారు. గణేష్ ఇందుకూరి నిర్మించే ఈ చిత్రాన్ని శ్రీవాస్ డైరక్ట్ చేయనున్నారు. శ్రీవాస్...కొద్ది నెలల క్రిందట దిల్ రాజు బ్యానర్ లో రామ్ హీరోగా రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని రూపొందించారు. అయితే అది భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ని వరసగా పేర్చుకుంటూ వచ్చిన ఈ చిత్రం శ్రీవాస్ కి మరో సినిమా ఇప్పించలేకపోయింది. అయితే గోలీమార్,శంఖం చిత్రాలతో ప్లాపుల్లో ఉన్న గోపీచంద్..కి తనకు లక్ష్యం వంటి హిట్టిచ్చిన డైరక్టర్ అయితే తిరిగి లైన్ లో కెరీర్ ని పెడతారనిపించి పిలిపించి సినిమా ఇచ్చారని తెలుస్తోంది. అందులోనూ తన సెంటిమెంట్ కు తగ్గట్లుగా టైటిల్ కూడా పెట్టాడని కూడా కమిటయ్యారని తెలుస్తోంది. ఇక అనుష్క కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తే మరింత బలం వస్తుందని ఆశిస్తున్నాడు.