Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గోపీచంద్.. సెంటిమెంట్ ఈ సారి వర్కవుట్ అవుతుందా?
గోపిచంద్ కి ఓ విచిత్రమైన టైటిల్ సెంటిమెంట్ ఉంది. అతని సినిమాల చివరన "0" ఉండాల్సిందే. వరసగా యజ్ఞం, రణం, శౌర్యం, లక్ష్యం అంటూ హిట్ కొట్టారు. అయితే శంఖం చిత్రంతో అది రివర్స్ అయింది. అయినా తన సెంటిమెంట్ ని విడిచి పెట్టేటట్లు గోపీచంద్ కనపడటం లేదు. తన తాజా చిత్రానికి రౌద్రం అనే టైటిల్ పెట్టుకున్నారు. గణేష్ ఇందుకూరి నిర్మించే ఈ చిత్రాన్ని శ్రీవాస్ డైరక్ట్ చేయనున్నారు. శ్రీవాస్...కొద్ది నెలల క్రిందట దిల్ రాజు బ్యానర్ లో రామ్ హీరోగా రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని రూపొందించారు. అయితే అది భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ని వరసగా పేర్చుకుంటూ వచ్చిన ఈ చిత్రం శ్రీవాస్ కి మరో సినిమా ఇప్పించలేకపోయింది. అయితే గోలీమార్,శంఖం చిత్రాలతో ప్లాపుల్లో ఉన్న గోపీచంద్..కి తనకు లక్ష్యం వంటి హిట్టిచ్చిన డైరక్టర్ అయితే తిరిగి లైన్ లో కెరీర్ ని పెడతారనిపించి పిలిపించి సినిమా ఇచ్చారని తెలుస్తోంది. అందులోనూ తన సెంటిమెంట్ కు తగ్గట్లుగా టైటిల్ కూడా పెట్టాడని కూడా కమిటయ్యారని తెలుస్తోంది. ఇక అనుష్క కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తే మరింత బలం వస్తుందని ఆశిస్తున్నాడు.