Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
మాచో స్టార్ గోపీచంద్ కొత్త డైరెక్టర్ తో కొత్త చిత్రం...!
ఈ మధ్య కాలంలో విజయాలకు దూరమైన యాక్షన్ హీరో గోపీచంద్, తన తదుపరి చిత్రాలను ఎలాగైనా హిట్ చేయాలన్న తాపత్రయంలో వున్నాడు. ఆ క్రమంలో చంద్రశేకర్ యేలేటి దర్శకత్వంలో ఓ యాక్షన్ కథా చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడు. అది త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే, తాజాగా మరో సినిమాను కూడా గోపీచంద్ అంగీకరించినట్టు తెలుస్తోంది.
'వేదం", 'మర్యాదరామన్న" చిత్రాలను నిర్మించి ప్రస్తుతం 'పంజా" చిత్రానికి ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తుందనీ, దీనికి సత్యనారాయణ అనే కొత్త దర్శకడు, దర్శకత్వం వహిస్తాడనీ అంటున్నారు. గతంలో కే.రాఘవేంద్ర రావు గారు నిర్మించిన టీవీ సేరియల్స్ కి సత్యనారాయణ దర్శకుడిగా పనిచేసారు. సత్యనారాయణకు గతంలో కె.రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన అనుభవం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియచేయనున్నారు. గోపీచంద్ నటించిన లాస్ట్ సినిమా 'మొగుడు" నిరాశపరచగా ఈ కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది.