Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మాచో స్టార్ గోపీచంద్ కొత్త డైరెక్టర్ తో కొత్త చిత్రం...!
ఈ మధ్య కాలంలో విజయాలకు దూరమైన యాక్షన్ హీరో గోపీచంద్, తన తదుపరి చిత్రాలను ఎలాగైనా హిట్ చేయాలన్న తాపత్రయంలో వున్నాడు. ఆ క్రమంలో చంద్రశేకర్ యేలేటి దర్శకత్వంలో ఓ యాక్షన్ కథా చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడు. అది త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే, తాజాగా మరో సినిమాను కూడా గోపీచంద్ అంగీకరించినట్టు తెలుస్తోంది.
'వేదం", 'మర్యాదరామన్న" చిత్రాలను నిర్మించి ప్రస్తుతం 'పంజా" చిత్రానికి ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తుందనీ, దీనికి సత్యనారాయణ అనే కొత్త దర్శకడు, దర్శకత్వం వహిస్తాడనీ అంటున్నారు. గతంలో కే.రాఘవేంద్ర రావు గారు నిర్మించిన టీవీ సేరియల్స్ కి సత్యనారాయణ దర్శకుడిగా పనిచేసారు. సత్యనారాయణకు గతంలో కె.రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన అనుభవం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియచేయనున్నారు. గోపీచంద్ నటించిన లాస్ట్ సినిమా 'మొగుడు" నిరాశపరచగా ఈ కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది.