Don't Miss!
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'ఊసరవిల్లి' నిర్మాతతో గోపీచంద్ ఖరారు
ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రం నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ తో ఖరారు అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ డైరక్ట్ చేయనున్నారు. గతంలో గోపిచంద్,ఏలేటి చంద్రశేఖర్ కాంబినేషన్ లో ఒక్కడున్నాడు చిత్రం రూపొందింది.కానీ వర్కవుట్ కాలేదు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై రూపొందింనున్న ఈ చిత్రం గురించి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ...''గోపీచంద్, ఏలేటి చంద్రశేఖర్ల కాంబినేషన్లో ఓ వెరైటీ కమర్షియల్ ఫిలిమ్ని నవంబర్లో రెగ్యులర్ షూటింగ్తో ప్రారంభిస్తున్నాం. సబ్జెక్ట్ చాలా బాగుంది.. డెఫినెట్గా ఈ కాంబినేషన్లో చాలా మంచి హిట్ సినిమా అవుతుంది. త్వరలోనే మిగిలిన వివరాలు తెలియజేస్తాను'' అన్నారు.
ప్రసుత్తం గోపీచందర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న 'మొగుడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు సమాచారం. ఏలేటి, గోపీచంద్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఐతే, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.ఇక చాలా కాలంగా వెంకటష్ హీరోగా ఏలేటి చిత్రం చేయాలని తిరగారు.కానీ సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో సినిమా ముందుకు వెళ్లలేదు.దాంతో యేలేటి ఈ చిత్రం చేయటానికి రెడీ అయ్యారు.