Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
గోపీచంద్ పంతం టీజర్ విడుదల తేది ఖరారు!
'ఆంధ్రుడు, యజ్ఞం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం' వంటి సూపర్డూపర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. గోపీచంద్ కెరీర్లో లాండ్ మార్క్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.
జూన్ 5న ఉదయం 11 గంటలకు పంతం సినిమా టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. గోపీచంద్ సెంటిమెంట్, టైటిల్ చివరన సున్నాని కూడా 'పంతం' సాటిస్ఫై చెయ్యడంతో ఈ టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. గోపీచంద్ సరసన మెహరిన్ ఈ సినిమాలో నటిస్తోంది.
గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తుండగా, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ ఐ పాత్రలో కనిపించబోతున్నాడు. జూలై 5వ తేదీన విడుదలకానున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.