Don't Miss!
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గోపీచంద్ ‘పంతం’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. గతంలో పవర్, జై లవకుశ చిత్రాలకు రచయితగా పని చేసిన కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మెహ్రీన్ హీరయిన్. ఇందులో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతోంది.
కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
విజయవాడలో జూన్ 21న ఆడియో విడుదల కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఆ తర్వాత వైజాగ్లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు. ఈ చిత్రంలో పృధ్వి, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంగీతం: గోపీ సుందర్ కెమెరా: ప్రసాద్ మూరెళ్ల ఆర్ట్: ఏఎస్ ప్రకాష్ మాటలు: రమేష్ రెడ్డి స్క్రీన్ ప్లే: కె చక్రవర్తి, బాబీ(కెఎస్ రవీంద్ర) కో డైరెక్టర్: బెల్లంకొండ సత్యం బాబు ప్రొడ్యూసర్: కెకె రాధా మోహన్ స్టోరీ, డైరెక్షన్: కె. చక్రవర్తి( చక్రి).