పవన్ ను ఏడ్పించిన పాట

By Staff

Pawan Kalyan
ఊరి దొరలకు ఉంపుడుగత్తెవు జోగినమ్మ అంటూ జోగిని వ్యవస్ధపై పవన్ కళ్యాణ్ పాటెత్తుకున్నారు. నిన్న(శుక్రవారం) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సామాజిక న్యాయ సభకు హాజరైన యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ ఆ పాటపాడి అభిమానులను అలరించారు.అలాగే ఈ పాట తనను ఏడింపించిందంటూ,సమస్యలను అర్దం చేసుకునేందుకు ఇంతకంటే ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ సమస్యలపై మాట్లాడేందుకు ఇక్కడే పుట్టాల్సిన అవసరం అవసరం లేదని.. తెలంగాణ ప్రజల సమస్యలు తనకు తెలియనివి కావంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇక పవన్ పాట పాడుతున్న సమయంలో సభకు హాజరైన ప్రజానీకం కోరస్ కలిపేందుకు వేదిక వద్దకు వచ్చి తోసుకుంటూండగా ప్రజాగాయకుడు గద్దరు వాలంటీర్ గా వారిని నిలవరించే ప్రయత్నం చేయటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గద్దర్ గురించి మాట్లాడుతూ మృత్యువును జయించి పాటై మ్రోగుతున్న గద్దరన్న అని వ్యాఖ్యానించారు. తనకు గద్దర్ గురించి ఎప్పుడో తెలుసునని,నెల్లూరులో ఉన్న సమయంలో తాను గద్దర్ సభకు వెళ్ళానని,అప్పట్లో ఆయన ఏం పాడారో అర్ధం కాకపోయినా ఉత్సాహాన్ని కల్గించిందని ఆయన అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X