Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
గౌరవం : ఎన్నారైల కోసం ప్రకాష్రాజ్ ఆఫర్
హైదరాబాద్ : అల్లు శిరీష్ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ నిర్మించిన 'గౌరవం' చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే పెట్టిన పెట్టుబడిలో వీలైనంత వరకు రాబట్టుకునేందుకు ప్రకాష్ రాజ్ వివిధ మార్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు.
విదేశాల్లో స్థిర పడ్డ ఎన్నారైల కోసం ప్రకాష్ తాజాగా సరికొత్త ఆఫర్ ప్రకటించారు. గౌరవం సినిమాను కేవలం 5 అమెరికన్ డాలర్లకే ఆన్లైన్లో లీగల్గా హెచ్డి క్వాలిటీలో ఆన్లైన్లో చూసే అవకాశం కల్పిస్తున్నాడు. ఈ అవకాశం భారత్, అమెరికాలో ఉంటున్న వారికి తప్ప అన్ని దేశాల్లో ఉండే వారికి వస్తుంది.
ఈ సినిమాను ఆన్ లైన్లో చూసే వారికి మరో బోనస్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. 5 యూఎస్ డాలర్లు చెల్లించి 'గౌరవం' సినిమా చూస్తే 'ధోని' సినిమాను ఫ్రీగా చూపిస్తారట. అయితే మే 1 లోపు మాత్రం ఈ అవకాశం. డబ్బులు చెల్లించాక ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యల వల్ల మీరు 'గౌరవం' సినిమా చూడలేక పోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్. పూర్తి వివరాల కోసం http://prakashrajlive.com వెబ్ సైట్ ను సంప్రదించండి.
అల్లు శిరీష్ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బేనర్పై రాధామోహన్ దర్శకత్వంలో నిర్మాత ప్రకాష్ రాజ్ 'గౌరవం' చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు. కుల వ్యవస్థ, దానివల్ల జరిగే గొడవల మీద తెరకెక్కిన ఈ సినిమాలో యామి గౌతం హీరోయిన్ గా నటించింది.