Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గౌరవం : ఎన్నారైల కోసం ప్రకాష్రాజ్ ఆఫర్
హైదరాబాద్ : అల్లు శిరీష్ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ నిర్మించిన 'గౌరవం' చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే పెట్టిన పెట్టుబడిలో వీలైనంత వరకు రాబట్టుకునేందుకు ప్రకాష్ రాజ్ వివిధ మార్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు.
విదేశాల్లో స్థిర పడ్డ ఎన్నారైల కోసం ప్రకాష్ తాజాగా సరికొత్త ఆఫర్ ప్రకటించారు. గౌరవం సినిమాను కేవలం 5 అమెరికన్ డాలర్లకే ఆన్లైన్లో లీగల్గా హెచ్డి క్వాలిటీలో ఆన్లైన్లో చూసే అవకాశం కల్పిస్తున్నాడు. ఈ అవకాశం భారత్, అమెరికాలో ఉంటున్న వారికి తప్ప అన్ని దేశాల్లో ఉండే వారికి వస్తుంది.
ఈ సినిమాను ఆన్ లైన్లో చూసే వారికి మరో బోనస్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. 5 యూఎస్ డాలర్లు చెల్లించి 'గౌరవం' సినిమా చూస్తే 'ధోని' సినిమాను ఫ్రీగా చూపిస్తారట. అయితే మే 1 లోపు మాత్రం ఈ అవకాశం. డబ్బులు చెల్లించాక ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యల వల్ల మీరు 'గౌరవం' సినిమా చూడలేక పోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్. పూర్తి వివరాల కోసం http://prakashrajlive.com వెబ్ సైట్ ను సంప్రదించండి.
అల్లు శిరీష్ను హీరోగా పరిచయం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బేనర్పై రాధామోహన్ దర్శకత్వంలో నిర్మాత ప్రకాష్ రాజ్ 'గౌరవం' చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు. కుల వ్యవస్థ, దానివల్ల జరిగే గొడవల మీద తెరకెక్కిన ఈ సినిమాలో యామి గౌతం హీరోయిన్ గా నటించింది.